7.7.13

కచోరీలు

కచోరీలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 1 కప్పు
నానబెట్టిన పెసరపప్పు -- 1/2 కప్పు
శెనగపిండి -- 1 కప్పు
గరంమసాలా పౌడర్ -- 1/4 స్పూన్
ఉప్పు & కారం -- తగినంత
అప్పడాల షోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, అప్పడాలషోడా వేసి తగినన్ని నీళ్ళు పోసి, చపాతీపిండిలాగా కలుపుకోవాలి. పెసరపప్పుని ఒకగంట ముందు నానబెట్టుకొని, రుబ్బి, అందులో శెనగపిండి, ఉప్పు, కారం, గరంమసాలా వేసి, స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి, దగ్గరపడేవరకు ఉడికించి దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న - చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు మైదాపిండిని చిన్న చిన్న చపాతీలుగా వత్తుకొని, పెసరఉండలిని మధ్యలోపెట్టి, అంచులు మూసి, మళ్ళీ చపాతీలుగా వత్తుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నూనె పోసి, కాగిన తరవాత వత్తుకొని ఉంచుకున్న, కచోరీలను దోరగా వేయించి ఒక ప్లేట్ప లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిమీద మనకు ఇష్టమైతే, సన్నని కారపుపూస, కొత్తిమీర, టమాట, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలంకరించుకొని, ఇష్టమైన చట్నీలతో తినొచ్చును. అంతే కరకరలాడే కమ్మని కచోరీ రెడీ.



No comments:

Post a Comment