30.4.13

పనసపొట్టు ఆవ కూర

పనసపొట్టు ఆవ కూర:-

కావలసిన పదార్థాలు:
పనసపొట్టు- 1/4 కేజీ
చింతపండు- పెద్ద నిమ్మకాయంత
ఉప్పు -రుచికి సరిపడినంత
పసుపు -చిటికెడు
పోపు సామాన్లు
నూనె -ఒక కప్పు
జీడిపప్పు -50గ్రా
అల్లం'ముక్క చిన్నది
ఇంగువ సరిపడినంత
(ఆవముద్ద తయారుచేయు విధానం:::3 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 4 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

కూర తయారుచేసే విధానం:-
ముందుగ స్టవ్ వెలిగించి,ఒక గిన్నెలో పనసపోట్టుని వేసి ....చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి 15 నిమిషములు ఉడికించి, నీరు ఉంటే వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని నూనె వేసి, పోపు దినుసులు, అల్లం ముక్కలు,కరివేపాకు, ఇంగువ,జీడిపప్పు వేసి వేగాక వార్చిపెట్టుకున్న పనసపొట్టును వెయ్యాలి.5 నిమిషములు అయ్యాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఆవ ముద్దని వేసి, కొంచం నూనె వేసి, కదిపి 5 నిమిషములు ఉంచి దించెయ్యటమే.అంతే ఎంతో రుచికరమైన పనసపొట్టు ఆవ కూర రెడీ.......


No comments:

Post a Comment